కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

అసలు ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?

ఈ లోకాన్ని పరిపాలించేది దేవుడే అయితే ఇన్ని బాధలు ఉంటాయా?

దేవుడే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని చాలామంది అనుకుంటారు. ఒకవేళ అదే నిజమైతే లోకంలో ఇన్ని బాధలు ఉంటాయా? (ద్వితీయోపదేశకాండము 32:4, 5) నిజానికి, ఈ లోకం ఒక దుష్టుని అధీనంలో ఉందని బైబిలు చెబుతుంది.1 యోహాను 5:19 చదవండి.

ఇంతకీ, మనుషుల మీద అతనికి అధికారం ఎలా వచ్చింది? దేవుడు మొదటి మానవ దంపతులను సృష్టించిన తర్వాత, ఒక దూత దేవుని మీద తిరుగుబాటు చేసి, తనలాగే తిరుగుబాటు చేసేలా వాళ్లను పురికొల్పాడు. (ఆదికాండము 3:1-6) ఆ తిరుగుబాటుదారుడే సాతాను. వాళ్లు అతని మాట విని అతణ్ణి తమ పరిపాలకునిగా చేసుకున్నారు. నిజానికి, పరిపాలించే హక్కు సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే ఉంది. అయినా, తన మీద ప్రేమతోనే ప్రజలు తనను తమ పరిపాలకునిగా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (ద్వితీయోపదేశకాండము 6:6; 30:16, 19, 20) విచారకరంగా, మొదటి మానవ దంపతుల్లాగే తప్పుడు నిర్ణయం తీసుకునేలా ప్రజల్లో ఎక్కువ శాతం మందిని సాతాను మోసగించాడు.ప్రకటన 12:9 చదవండి.

మానవుల సమస్యల్ని ఎవరు పరిష్కరిస్తారు?

సాతాను దుష్ట పరిపాలనను దేవుడు ఇంకా కొనసాగనిస్తాడా? లేదు! ఆయన సాతాను చేసిన కీడంతటినీ యేసు ద్వారా తొలగిస్తాడు.1 యోహాను 3:8 చదవండి.

దేవుని శక్తితో యేసు సాతానును నాశనం చేస్తాడు. (రోమీయులు 16:20) ఆ తర్వాత దేవుడే మానవుల్ని పరిపాలిస్తాడు. తాను మొదట అనుకున్నట్లు, మనుషులు శాంతిసంతోషాలతో జీవించేలా చేస్తాడు.ప్రకటన 21:3-5 చదవండి. (w14-E 05/01)