కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

TheCrimsonMonkey/E+ via Getty Images

పర్యావరణ సమస్యలు— దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

పర్యావరణ సమస్యలు— దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

 “వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పుల వల్ల ప్రజలమీద, పట్టణాల మీద, ఇతర పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాతావరణ మార్పుల వల్ల తుఫానులు మునుపటి కంటే మరింత ఎక్కువ భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి; ఇళ్లని, ప్రజల జీవనాధారాన్ని మట్టిలో కలిపేస్తున్నాయి. అంతేకాదు, సముద్రాలు కూడా విపరీతంగా వేడెక్కుతున్నాయి. దానివల్ల, వాటిలో ఉండే చాలా జీవాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది.—ఇంగర్‌ ఆండర్సన్‌, అండర్‌-సెక్రెటరీ-జనరల్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌ అండ్‌ ఎక్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద యూఎన్‌ (UN) ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రామ్‌, 2023, జూలై 25.

 ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యల్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు ఒక్క తాటి మీదికి వస్తాయా? వాళ్లు శాశ్వత పరిష్కారాల్ని తీసుకురాగలరా?

 ఈ భూమ్మీదున్న పర్యావరణ సమస్యలన్నిటినీ పరిష్కరించే సామర్థ్యం ఉన్న ఒక ప్రభుత్వం గురించి బైబిలు మాట్లాడుతుంది; అది వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తుంది అని కూడా చెప్తుంది. భూమ్మీదున్న సమస్యలన్నిటినీ పూర్తిగా తుడిచి పెట్టేయడానికి “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు” అని బైబిలు చెప్తుంది. (దానియేలు 2:44) అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భూమికీ, తోటి మనుషులకీ ‘హాని గానీ నాశనం గానీ చేయరు.’—యెషయా 11:9.